శాస్త్ర వికాసం
సైన్సు సమాజం బుద్దికొలతలు
డా. విరించి విరివింటి “Rank is not a property of the world. It is an imposition of our culture.” -Stephen Jay Gould Introduction: మన ఆలోచనలు, మన ప్రవర్తనలే కాక, మనం “విజ్ఞానం” లేదా “సైన్స్”గా భావించే విషయాల పట్ల మన దృక్పథం కూడా పూర్తిగా నిష్పాక్షికమై, తటస్థంగా ఉండదని చరిత్ర స్పష్టంగా చెబుతోంది. నిరూపిస్తున్నది కూడా. మన విజ్ఞానపు అవగాహన, దానికి అనుసంధానమైన
ప్రాచీన లిపి గుట్టు ఎలా రట్టయింది?
ఇప్పుడు మనం చకచకా అనుకున్నది రాసేస్తున్నాం. అలవోకగా దాన్ని చదివేస్తున్నాం. మరి ఈ రాత ఎలా మొదలైంది? ఎలాగో మొదలైంది అనుకుందాం. మరి ఈ ప్రాచీన లిపిని ఇప్పుడు చదివిన వాళ్ళు ఎవరైనా వున్నారా? వుంటే వాళ్ళు ఎలా చదివారు ?దీనికో పెద్ద కథ ఉంది మనిషికి భాష వచ్చీ రాకముందే రాయడం వచ్చు. ఎప్పుడో 25 వేల ఏళ్ల నాటి రాతలకీ, గీతలకీ సైతం ఓ అర్థం వుందని
సామాన్యుడు శాస్త్రజ్ఞుడైన వేళ!
ప్రొ. యశ్ పాల్ అతడో పల్లెటూరి రైతు. అతనికున్నదల్లా ఓ పంపుసెట్టు. అదే అతని ప్రాణం, జీవనాధారం. దాని అంగాంగమూ అతనికి తెలుసు. దాని ప్రతి కదలికా అతని కనుసన్నల్లోనే జరుగుతుంది. అప్పుడప్పుడూ అది మొరాయిస్తుంది. అయితేనేం? దాన్ని బుజ్జగించి (మరమ్మత్తు చేసి) దారిలో పెట్టుకోవడం అతనికి చిటికెలోపని! ఆ రైతు కొడుక్కి పదేళ్లు. వాడికి ఈ పంపుసెట్టు పని అంటే మహా సరదా. జుగాడ్ ఇలా పుట్టిందిఒకరోజు మన
జీవపరిణామం ఆగిపోయిందా? కొనసాగుతోందా?
మానవునితో జీవపరిణామం ఆగిపోయిందా లేక కొనసాగుతోందా అంటే సమాధానం రెండు విధాలుగా వస్తుంది. కింది స్థాయి జీవులనుండి ఉన్నత జీవులకు పరిణామం నేటికీ కొనసాగుతోంది అనేది మొదటి సమాధానం. మానవుని తరువాత పరిణామం ముందుకు సాగడం ఆగిపోయినట్లే అన్నది రెండో సమాధానం. జీవపరిణామం అన్నది ఒక నిరంతర క్రమం. పదార్థ నిత్య చలనంలో, నిత్య పరిణామంలో అది అంతర్భాగం. ఈ భూమి, (గ్రహాలు కూడా పదార్థ చలనంలో భాగంగా ఏర్పడినవే.
విజ్ఞాన శాస్త్రం- వికృత ధోరణులు
విజ్ఞాన శాస్త్రం రుజువులతో వాస్తవాల్ని బయటపెట్టాలి. సత్యాన్ని పరమధర్మంగా భావించాలి. సంకుచిత ధోరణి నుంచి మళ్లించి సమాజానికి విశాల దృక్పథం కలిగించాలి. విశ్వమానవత్వం దాని అంతిమలక్ష్యంగా వుండాలి. దాని పరిశోధనల్లో, సూత్రీకరణల్లో స్వీయ మానసికతకు, స్వార్ధపర శక్తుల ప్రయోజనాలకు తావుండరాదు. అధిపత్య వర్గాల చేతుల్లో పావుగా మారి, సైన్సు పేర వారి చేతికి కొత్త పరికరాలు అందించరాదు. ఒక్క మాటలో చెప్పాలంటే సైన్సు నుంచి మనం సత్యాన్ని ఆశిస్తాం. శాస్త్రవేత్తలు
ప్రాచీన భారత దేశంలో గణిత శాస్త్రం
జవహర్ లాల్ నెహ్రూ ప్రాచీన భారతీయులు ఉన్నత విజ్ఞానవంతులై రూపం లేని వాటిని గురించి కూడా ఎక్కువ ఆలోచించేవారు. కాబట్టి గణిత శాస్త్రంలో కూడా వారెంతో గొప్పవారు. యూరపు అంక బీజ గణితాలను అరబ్బుల నుంచి నేర్చుకొంది. కానీ ఆ అరబ్బులు భారతదేశ నుండి వీటిని నేర్చుకున్నారు. అందువల్లనే ప్రపంచమంతా వాడుకలో ఉన్న అంకెలను అరబ్బీ అంకెలు అంటారు. కానీ ఇప్పుడు అంక బీజగణితాల జన్మస్థలం భారతదేశమేనని అందరూ అంగీకరిస్తున్నారు.
కృత్రిమ మేధ ఎలా పనిచేస్తుంది ?
రాహుల్జీ 1950లో శాస్త్రవేత్తల యంత్రాలు కూడా మనుషుల్లాగా సొంతంగా నిర్ణయాలు తీసుకోగలవా? అనే ఆలోచన నుంచి రూపొందింది కృత్రిమ మేధ. ఇంతవరకు మానవుడు కనిపెట్టిన యంత్రాలన్నీ అతని శారీరక శ్రమను లేదా కొంతమేరకు మేధోశ్రమను తగ్గించేవి మాత్రమే! కానీ మొదటిసారి మానవుడి మేధకు ప్రత్యామ్నాయం అనిపించే ఆవిష్కరణలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు విరివిగా వాడుతున్న చాట్ జిపిటి. ఒక దశాబ్దం ముందు ఇవి సామాన్యుల ఊహకు అందనివి. ప్రజల ఉపయోగానికి
సూడో సైంటిఫిక్ జాతి వాదం
- డా. విరించి విరివింటి "ఆర్కపెలాగో" అంటే 'ద్వీపాల సముదాయం' అని అర్థం. మన భూమి మీద వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ద్వీపాల సముదాయాలు ఎన్నో వున్నాయి. ఇవి కాలక్రమంలో పెద్ద ఖండాల నుండి విడిపోయినవి కావడంతో మొక్కల, జంతువుల, మనుషుల గురించి లోతుగా తెలుసుకోవడానికి ప్రకృతి సహజమైన జీవశాస్త్ర ప్రయోగశాలల్లాగా ఉపయోగపడతాయి. అందుకే ఆంత్రోపాలజిష్టుల నుంచి పరిణామ వాదులు, పర్యావరణవేత్తలు, డాక్టర్లు దాకా ఈ ప్రాంతాలలో పరిశోధనలు చేయడానికి
శాస్త్ర వికాసం
నాగరికతల సంగమంలో భారతీయ గణిత విజ్ఞానం - అనుసృజన: వి. రాహుల్జీ ఇంత దూరం మానవ నాగరికత వర్ధిల్లుతోందంటే అదంతా ఇచ్చిపుచ్చుకోవడాల వల్లే సాధ్యమైంది. ఒక్కో చారిత్రక సంధ్యలో ఒక్కో నాగరికత ఒక్కో ఆవిష్కరణకు బాట వేసి వుండొచ్చు, ఒక ప్రకృతి నియమాన్ని పట్టుకొని వుండొచ్చు. దీనికి కచ్చితంగా ఆ నాగరికతను ప్రశంసించాల్సిందే. చరిత్రలో దానికా స్థానం దక్కాల్సిందే. అయితే ఏ నాగరికతా తనకు తాను సంపూర్ణం కాదు. ఒంటరిదీ కాదు.