సైన్స్ పరిశోధకుడు, సత్యశోధకుడు, దేశరక్షణ దీపదారి డా. సూరి భగవంతం
వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 16 డా. నాగసూరి వేణుగోపాల్ తెలుగునాట శాస్త్రవేత్తగా గణనీయమైన పేరు గాంచిన వ్యక్తి డా.సూరి భగవంతం. వీరు సి.వి.రామన్ శిష్యులుగా, అంతే వాసిగల శాస్త్రవేత్తగా, యుద్ధ విజ్ఞానశాస్త్ర సంబంధించిన దార్శనికులుగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగపు నిర్మాతగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్దేశకులుగా, నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మూలపురుషుడుగా సదా చిరస్మరణీయులు! 1909 అక్టోబర్ 14న కృష్ణా
