ప్రాచీన, మధ్యయుగాల భారతీయ గణిత ప్రతిభను చాటిచెప్పిన టి.ఏ. సరస్వతి అమ్మ
వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 14 డా. నాగసూరి వేణుగోపాల్ ఆధునిక భారతదేశపు తొలి మహిళాగణిత శాస్త్రవేత్త టి. ఏ. సరస్వతి అమ్మ చేసిన పరిశోధన కారణంగానే భారతదేశంలో ప్రాచీన కాలంలోనే కాకుండా మధ్యయుగంలో కూడా గొప్పగా గణితవిజ్ఞానం వర్ధిల్లిందని మనకూ, అలాగే ప్రపంచానికి స్పష్టమైంది. భారతీయ, గ్రీకు గణిత విజ్ఞానపు పరంపరలకు సంబంధించి తన పరిశోధనలతో వంతెన నిర్మించిన ప్రతిభా శాలి కూడా ఆమె. కేరళ ప్రాంతం పాలక్కాడు జిల్లా
