ముసురుకొస్తోన్న మేధోమాంద్యం
క్రమంగా మానవ సమాజం మూగబోతోందా? భిన్న దృక్పథాల ప్రవాహాలకూ, నూతన ఆలోచనా స్రవంతులకూ తావులేని ఎడారిగా మారుతోందా? మనిషి ప్రశ్నించడం మరిచిపోతున్నాడా? ఎదిరించడం, నిలదీయడం, ప్రజల పక్షాన నిలబడడం మేధావులు తమ పని కాదనుకుంటున్నారా? మౌనధారణే మేలనుకుంటున్నారా?










