భారతీయ మధ్యయుగాలు – కొన్ని వృతులూ, కొన్ని సాంకేతికతలు
డా.గేయానంద్ భారతదేశ చరిత్రలో 12వ శతాభ్ధాన్ని ఒక మలుపుగా చూస్తారు. ఉత్తర భారతదేశంలో టర్కు-ఆఫ్గానుల ఆక్రమణలు ప్రారంభమైంది 1192 AD – 1206 AD ల కాలంలోనే. అప్పటికే భారతదేశానికి గ్రీకు, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాలతో సాంస్కృతిక సంబంధాలున్నాయి. నిజానికి ఈ సంబంధాలు చరిత్రకు పూర్వ యుగం నుండే ఉన్నాయి. అయితే 12వ శతాబ్ధంలో సైనికులతో పాటు పండితులు కూడా దేశంలోకి ప్రవేశించారు. ఈ పరస్పర సంబంధాలలో
