నమ్మకం-నిజం

ప్రమాదంలో (ప్రమాదమైన) గుడ్లగూబ

మిఠాయి యుగంధర్ బాబు గూబ యెక్కినట్టి గురము పాడుగ బెట్టివెళ్లి పోదురంత వెర్రి వారుగూబ యేమి చేసె గురమేమి చేసును?విశ్వదాభిరామ వినురవేమ! ఆరు శతాబ్దాల క్రితమే వేమన గారు పై పద్యములో ప్రజల మూఢనమ్మకాల గురించి గుడ్డి నమ్మకాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. పై పద్యంలో గుబ అంటే గుడ్లగూబ గురము అంటే ఇక్కడ గుర్రము అనుకోవచ్చు (లేక ఓ ఇల్లు అనుకోవచ్చు) ఒక గుడ్లగూబ ఓ ఇంటి
మంచిమాట

మంచిమాట

సత్యంసత్యం అధిక సంఖ్యాకుల గుత్తాధిపత్యం కానక్కర్లేదు!అల్ప సంఖ్యాకులు కూడా ప్రపంచంలో ఎన్నో సత్యాల్ని వెలికితీసారు!!అందరూ అంగీకరించిన తర్వాతే సత్యం నిర్ధారణ కావడమనేది ఎప్పుడూ జరుగదు!!!- ఆచార్య సచ్చిదానంద మూర్తి
సంపాదకీయం

పరిశోధనా రంగానికి ప్రమాద ఘంటికలు!

సంపాదకీయం ఈ మాట నమ్మశక్యం గానిది.  కారణం పరిశోధన లేని వైజ్ఞానిక పురోగతి లేదు. వైజ్ఞానిక అభివృద్ధిలేని  సమాజ పురోగమనమూ లేదు. ఈ రంగంలో పోటీపడి ముందు నిలబడలేని దేశాలు ఎంత సంపదా, ఎంత సంస్కృతీ, ఎంత చరిత్రా వున్నా ముందుకు పోలేవు. శాస్త్ర సాంకేతికాభివృద్ధి పైనే ఆధునిక ప్రపంచం నడుస్తోంది. అమెరికా  ప్రపంచాధిపత్యం కూడా దీని వల్లనే సాగుతోంది. కానీ ఆశ్చర్యంగా అమెరికా తన పరిశోధనా కార్యక్రమాలకు కత్తెర
శాస్త్ర ప్రచారం

మనిషికి కోతికీ మధ్య ‘మిస్సింగ్ లింకు’ కోసం…

 డా.విరించి విరివింటి మనిషి తాను జీవించే జీవితానికి ఒక సార్థకతను సాధించాలనుకునే జీవి. Frontal cortex ( మెదడు ముందరి భాగం.ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులు ఇక్కడే జరుగుతాయి. ) అభివృద్ధి చెందిన మనిషి జ్ఞానం(cognition) లోనే ఈ "సార్థకత" భావన స్థిరపడి ఉంది‌. తన జీవితానికి సార్థకత ఉండాలనుకున్నందుకే దానిని సాధించడానికి ఒక క్రమత్వం (Pattern) కోసం అన్వేషణ మొదలవుతుంది‌. అందుకే మనిషిని క్రమత్వం కోరే జంతువు
చరిత్ర ఏమంటుంది

బౌద్ధ జైన చార్వాకుల కాలంలో ప్రోటో సైన్సు 600BC

డా. గేయానంద్ క్రీస్తుపూర్వం 600- 300 మధ్య కాలాన్ని, భారత ఉపఖండంలో ఒక గొప్ప పరివర్తనా కాలంగా భావించవచ్చు. ఉత్తర భారత తొలి చరిత్ర కాలాల ప్రారంభంగా, క్రీస్తుపూర్వం 600 సంవత్సరాన్ని గుర్తిస్తారు. అది వైదిక యుగం ముగుస్తున్న కాలం. వేద కాలాల నాటి, భావాలను సవాలు చేసిన కాలం. వైజ్ఞానిక ఆలోచనలు, సాంకేతికలు పురోగమించిన కాలం. భారత ఉపఖండ చరిత్రలో విశిష్టమైన కాలం. అదేమిటో చూద్దాం.  ఇనుము తెచ్చిన
శాస్త్రజ్ఞులు

దేశవాళీ రసాయన శాస్త్ర పరిశోధన, పరిశ్రమల అభివృద్ధి సాధించిన త్యాగధనుడు – ఆచార్య ప్రపుల్ల చంద్ర రే

డా. నాగసూరి వేణుగోపాల్ అది బ్రిటిష్ వారు పాలించే కాలపు భారతదేశ రాజధాని కలకత్తా పట్టణం. ఆ యువకుడు రసాయన శాస్త్ర అధ్యాపకుడు. ఆయన ఇల్లే ఒక చిన్న ప్రయోగశాల. పరిశోధనల కోసం పశువుల ఎముకలు సేకరించి ప్రయోగశాలలో పోగు చేశాడు. ఎముకల వాసన ప్రయోగశాలకే పరిమితం కాక, ఆ వీధి అంతా గుప్పుమంది! అంతేకాదు, కాకులు బారులుగా వాలి, వీధి అంతా పచార్లు కొడుతున్నాయి. దాంతో ఆ ప్రాంతం
నమ్మకం-నిజం

రైస్ పుల్లింగా? లేక రూకలు పుల్లింగా??

మిఠాయి యుగంధర్ బాబు బెల్లం చీమల్ని ఆకర్షిస్తుంది. అది ప్రకృతి నైజం. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. అది పదార్థ నైజం. ధనం మనుషుల్ని ఆకర్షిస్తుంది. ఇది ఆధునిక సమాజపు నైజం కదా! మరి దీనికి వ్యతిరేకంగా అంటే రివర్స్ గేర్ లో ఆ ధనాన్ని మనం ఆకర్షించ గలమా? అలా ఆకర్షించడానికి ఏదైనా యంత్రం ఉందా? (ఉంటే, గింటే దేశమంతా జనాలకు తలా ఒక యంత్రం ఇచ్చేస్తే పోలా). "ధనమేరా
ప్రజారోగ్యం

నిరంతర పరిశోధనల ఫలితం – అల్లోపతి వైద్యం

డా॥ కాలేషా బాషా “అల్లోపతి వైద్యంలో ప్రివెస్షన్ (వ్యాధినివారణ) లేదు..అంతా ఇన్వెస్టిగేషన్లూ, ట్రీట్మెంట్లే...యోగా అంటేనే శారీరక శ్రమ, అది కీళ్లజబ్బులూ, శ్వాస జబ్బులూ, బీపీ, షుగరూ, మానసిక జబ్బులూ, వెన్నుపూస జబ్బులూ ...ఇంకా చాలా  జబ్బులను నివారిస్తుంది...అల్లోపతికి చాలా పరిమితులున్నాయి....!” ఇలా అల్లోపతి వైద్యం గురించి జూన్ 21, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా తలో మాటా అన్నారు. కొంత మంది అల్లోపతి వైద్యులు, విజ్ఞానులు కూడా వంతపాడారు!!!మరి ఇవన్నీ
శాస్త్ర వికాసం

భారతీయుల DNA రూపుదిద్దుకున్న క్రమం

డా.టి.వి.వెంకటేశ్వరన్ డిఎన్ఏ అనేది మన పూర్వీకుల కథలతో నిండిన ఒక పెద్ద పురాతన పుస్తకం. ఇందులో మన తల్లిదండ్రుల లేదా తాత ముత్తాతలు కథలు మాత్రమే కాకుండా వేల సంవత్సరాల క్రితం జీవించిన ప్రజల కధలు కూడా ఉంటాయి. శాస్త్రవేత్తలు భారతదేశం నుండి 200700 మందికి పైగా వ్యక్తుల డిఎన్ఎను అధ్యయనం చేసి ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ప్రజల డిఎన్ఏ తో పోల్చారు. భారతదేశంలో జరిగిన గొప్ప అధ్యయనాల్లో ఒకటైన ఇది
తెలుసుకొందాం

పదార్ధాలలో పరమాణువులు సంధానించుకున్న పద్ధతిని బట్టి ఆయా పదార్దాలు తమ ధర్మాలను ప్రదర్శిస్తాయి.

ప్రొఫెసర్ ఏ. రామచంద్రయ్య 18 ప్రకృతి సూత్రాలు తెలుసుకుందాం..12వ సార్వత్రిక నియమంపదార్ధాలలో పరమాణువులు సంధానించుకున్న పద్ధతిని బట్టి ఆయా పదార్దాలు తమ ధర్మాలను ప్రదర్శిస్తాయి.(Properties of the Materials are Due to the Atomic Arrangement in Them) పిండి కొద్దీ రొట్టె అన్నట్లు పరమాణువుల నిర్మాణాన్ని బట్టి పదార్ధాల ధర్మాలు అనవచ్చును. ఒక పదార్ధం తీయగా ఉందా, పుల్లగా ఉందా, హానికరమా, ఉపయోగకరమా, ద్రవమా, ఘనమా, వాయువా,