భారతదేశంలో తొలి మధ్యయుగాలు- ఆర్యభట్టు ప్రభావం
డా. యం. గేయానంద్ తొలి మధ్యయుగాలలో భారతదేశం అనేక చిన్న మధ్యతరహా రాజ్యాలుగా విడిపోయింది. ఒక కేంద్రీకృత అధికారం క్షీణించింది. స్థానిక పాలకులు నిరంతర యుద్ధాలకు పాల్పడేవారు. వివిధ పద్ధతులలో ఫ్యుడలీకరణ జరిగింది. నగదుకు బదులు భూములను దానంగా/ ప్రతిఫలంగా ఇచ్చే పద్ధతి ఎక్కవయింది. విదేశీ వాణిజ్యం తగ్గడం వల్ల నగరాల ప్రాముఖ్యత తగ్గి గ్రామీణ ఆర్ధిక వ్వవస్థ బలపడింది. అనేక కొత్త ఉప కులాలు ఏర్పడ్డాయి. సామాన్య ప్రజల్లోకి
