సంపాదకీయం

చిక్కుల్లో చిన్న స్కూళ్ళు !

సంపాదకీయం గత పదేళ్లలో ఏకంగా దేశంలో 89,441 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. ఈ మూతల్లో మధ్యప్రదేశ్ (29 410), ఉత్తర ప్రదేశ్ (25,126) రాష్ట్రాలు 60.9% వాటాతో ముందున్నాయి. దీన్నీ మధ్య సాక్షాత్తు కేంద్ర విద్యా శాఖ ఉప మంత్రి జయంత్ చౌదరి గారు పార్లమెంటులో ప్రకటించారు. మన తెలుగు రాష్ట్రాలు ఈ “రికార్డును” 2015 కు ముందే సాధించాయి! వీటిలో 9503 పాఠశాలలు అప్పటికే తలుపులు మూసేశాయి. ఇవన్నీ
సంపాదకీయం

అంకెలూ – అబద్ధాలూ!

సంపాదకీయం అబద్ధాలు మూడు రకాలంటారు పండితులు! ఒకటి అలవోకగా చెప్పేవి ! రెండు ఆచి తూచి చెప్పేవి!! మూడు అంకెలతో చెప్పేవి !!! ఇంగ్లీషులో "ఫాక్ట్స్అండ్ ఫిగర్స్" అంటారు గాని దీన్ని మనం వర్తమానానికి వర్తింపజేసి చెప్పాలంటే "అబద్ధాలు అంకెలు" అనాలి. "సత్యమేవ జయతే" అని సాక్షాత్తు జాతీయ చిహ్నం మీదనే రాసుకున్న దేశంలో పాపం అంకెలకు ఈ గతి పట్టింది. చాలా విచిత్రమైన విషయం ఏమంటే మన చట్టసభల్లో
సంపాదకీయం

ఆనందం కరువైన అభివృద్ధి

సంపాదకీయం "ఆనందమె జీవిత మకరందం" అంటాడు సినీ కవి సముద్రాల. ఇంతకూ సదరు ఆనందానికి మూలకందం ఏది? అంతులేని సంపదలా? అఖండ జ్ఞాన విజ్ఞానాలా? శాంతి సామరస్యాలా? స్నేహమయ సామాజిక సంబంధాలా? జనచైతన్యమా? ప్రజానుకూల పాలనా విధానాలా? ఇటీవల విడుదలైన "ప్రపంచ సంతోష నివేదిక" (2025) వీటన్నిటిని తనదైన శైలిలో విశ్లేషించి దేశాలకు ర్యాంకులిస్తుంది. వీటిల్లో కొన్ని మన కళ్ళు తెరిపిస్తాయి. కొన్ని నివ్వెర పరుస్తాయి. కొన్ని ఉసూరుమనిపిస్తాయి. ఈ
సంపాదకీయం

“అయో”మయ రాజకీయాలు !

సంపాదకీయం వృత్తాసుర సంహారం కోసం దేవతల కంసాలి త్వష్ట ఇంద్రుడికి వజ్రాయుధం తయారు చేసి ఇచ్చాడట. దీంతో ఆ ఆర్య యోధుడికి ఎదురులేకుండా పోయిందట. ఒంటి చేత్తో శత్రు స్థావరాలను కకావికలం చేసాడట. ఫలితంగా ఇంద్రాధిపత్యం శాశ్వతంగా దఖలు పడిపోయిందట! ఇది పురాణం. ఆశ్చర్యం ఏమంటే ఆధునిక యుగంలోనూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతికి ఒక వజ్రాయుధం చిక్కింది. కాకుంటే ఇప్పుడాయనకు పురాతత్వ శాస్త్ర వేత్తలు నేల పొరల్నండి తవ్వితీసి
సంపాదకీయం

ఇప్పుడు మనకు ఐన్ స్టీన్లు లేరు, నెహ్రూలూ లేరు!

సంపాదకీయం “ఒక్క మానవజాతిని మాత్రమే గుర్తుంచుకోండి ! మిగిలినవన్నీ మరిచిపోండి” అంటుంది 1955 నాటి రస్సెల్- ఐన్ స్టీన్ మేనిఫెస్టో. విజ్ఞానశాస్త్రం ఊహాతీత హననానికి రాచబాట వేస్తున్నవేళ సూటిగా గుండెలకు గుచ్చుకునే ఈ రెండు మాటలు వాళ్ళు చెప్పి డెబ్బై ఏళ్ళు ముగుస్తున్నాయి. దాదాపు రెండు లక్షల మందిని క్షణాల్లో భస్మీపటలం చేసిన 1945 నాటి నాగసాకి, హిరోషిమా అణువిధ్వంసాన్ని చూచిన 'మ్యాన్ హట్టన్' ప్రాజెక్టు డైరెక్టర్ ఓపెన్ హైమర్
సంపాదకీయం

కాలమనంతం, భూమి విశాలం

సంపాదకీయం అనంత కాలప్రవాహంలోకి మరో సూక్ష్మ శకలం కలిసిపోయింది. మరొకటి కొత్త ఏడాది రూపంలో తలెత్తింది. ఆధునికమానవుడు అవనీతలంపై అవతరించిన నాటి నుండి కాలానికి ఎదురీదాలని ఎన్నెన్ని సాహసాలు చేస్తూ వచ్చాడో చెప్పలేము. ఎక్కడో తూర్పు ఆఫ్రికా నుంచి తెరలు తెరలుగా, గుంపులు గుంపులుగా మహానదీనదాలు. సాగరాలు దాటుకుంటూ భూమండలం అంతా విస్తరించిన అతని తెగువనూ, పట్టుదలనూ తలచుకుంటే మనల్ని సంభ్రమాశ్చర్యాలే కాదు, ఉత్తేజోద్వేగాలూ చుట్టుముడతాయి. ఆధునిక మానవుడి ఊహకైనా
సంపాదకీయం

ప్రకృతి నియమాలూ-  పర్యావరణ రాజకీయాలూ!

సంపాదకీయం తీవ్ర వాతావరణ సంఘటనల సంవత్సరంగా, అత్యంత ఉష్ణోగ్రతల కాలంగా చరిత్రలో నిలిచిపోతూ 2024 మనల్నించి సెలవు తీసుకుంటోంది. ఎప్పుడూ ఎరగని వడగల్పులు, చలిగాల్పులు మనల్నే కాదు శ్రీలంక, మాల్దీవుల్ని కూడా ఈ ఏడాది అతలాకుతలం చేశాయి. మొన్నటికి మొన్న"ఫంగల్" తీరం దాటుతున్నప్పుడు పాండిచ్చేరిలో ఒకేసారి 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది! కాయపట్నాన్ని (తూత్కుడి) 2023లో ఆకాశానికి రంధ్రం పడినట్లు ఒకేరోజు 95 సెంటీమీటర్ల వాన ముంచెత్తింది! ప్రతి ఏటా
సంపాదకీయం

ఇంకా నరబలులా?

కొన్ని వార్తలు వింటుంటే మనం ఆదిమ బర్బర యుగాల్లోంచి ఇంకా ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోతున్నామా అనిపిస్తుంది. అలాంటి వార్తల్లో ఒకటి ' 2014 -21 మధ్య 103 నరబలులు జరిగా'యన్న వార్త! సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ "జాతీయ నేర రికార్డు బ్యూరో" (NCRB) బయటపెట్టిన వాస్తవమిది. అంతే కాదు 2022లో కూడా ఇలాంటివి ఆరు జరిగాయట! ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (26 అక్టోబరు 2024) తాజా కథనమిది.
సంపాదకీయం

ఏ మలుపుకు చేరుకొన్నాం?

సంపాదకీయం "గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్" అంటాడు తిక్కన భారతంలో. మరి తిక్కనకు అంతకు ముందటి కాలమంతా అంత గొప్పగా ,తన కాలం దానికి తీసికట్టుగా ఎందుకు కనిపించిందో మరి! వర్తమానం మీదా, భవిష్యత్తు మీదా ఆయనకెందుకు ఆశాభావం లేదో మరి ! కానీ గురజాడ "మంచి గతమున కొంచెమేనోయ్" అంటాడు. శ్రీశ్రీ మరో అడుగు ముందుకేసి "గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో" అన్నాడు. వీళ్ళిద్దరికీ
సంపాదకీయం

ఏ వెలుగులకీ ప్రస్థానం?

"చారిత్రక విభాత సంధ్యల మానవ కథా వికాసమెట్టిది?ఏ దేశం ఏ కాలంలోసాధించినదే పరమార్ధం ?" అంటూ శ్రీశ్రీ అంతిమంగా "ఏ వెలుగులకీ ప్రస్థానం" అని ప్రశ్నిస్తాడు. నిజంగానే మానవ సమాజం వెలుగుల వైపే ప్రయాణం సాగిస్తోందా?  మొత్తంగా ప్రస్తుత కాలపు మానవజాతి ఆలోచనలు ఎలా వున్నాయి? ఏ దేశాల మానవుల భావ స్రవంతి ఎటువైపు ప్రవహిస్తోంది ? మళ్లీ పొరలు పొరలుగా  విడదీస్తే ఒకే దేశంలోని భిన్న సామాజిక వర్గాలు వేటికవిగా ఏ