సంపాదకీయం

సంపాదకీయం

కృత్రిమమేధ చెపుతున్న కొత్త పాఠం చిన్నప్పుడు మన పాఠశాలల్లో మనల్ని వారానికో, మాసానికో ఒకసారి ఏదో ఒక అంశంపై స్వంతంగా వ్యాసం రాయమనేవాళ్ళు. కిందామీదా పడి ఎక్కడెక్కడ నుంచో సమాచారం సేకరించుకొని రాసేవాళ్ళం. అందులో ఏవేవో ఆలోచనల్ని చొప్పించే వాళ్ళం. అందంగా రాయడానికి కుస్తీ పట్టేవాళ్ళం. మనకంటూ ఏదో ఒక ప్రత్యేకత వుండాలని తాపత్రయం పడేవాళ్ళం. ఇందులో కాపీలు ఉండేవి కావు. ఒకరి మీద ఆధారపడ్డం అసలే వుండేది కాదు.
సంపాదకీయం

ముసురుకొస్తోన్న మేధోమాంద్యం

సంపాదకీయం క్రమంగా మానవ సమాజం మూగబోతోందా? భిన్న దృక్పథాల ప్రవాహాలకూ, నూతన ఆలోచనా స్రవంతులకూ తావులేని ఎడారిగా మారుతోందా? మనిషి ప్రశ్నించడం మరిచిపోతున్నాడా? ఎదిరించడం, నిలదీయడం, ప్రజల పక్షాన నిలబడడం మేధావులు తమ పని కాదనుకుంటున్నారా? మౌనధారణే మేలనుకుంటున్నారా? ఒకవైపు మానవుడు భూనభోనాంతరాలను జయించానని జబ్బలు చరుస్తున్నాడు. ప్రకృతి శక్తుల్ని గుప్పిట్లో బంధించానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అవును మనిషి చరిత్ర ఎప్పుడూ ఎరగని ఆవిష్కరణలు చేస్తున్నమాట నిజమే. ఎల్లల్ని చెరిపేసి
సంపాదకీయం

ఉన్నత విద్యారంగం చట్టూ ఊహాలోక విహారం

సంపాదకీయం "ఉన్నత విద్యారంగం ఎలా వుంది ? ఏ వైపు పయనిస్తోంది "అనేదాన్ని బట్టి "మన సమాజం ఎలా వుంది ? అది ఏ వైపు నడుస్తోంది" అని మనం సులభంగా అంచనా వెయ్యొచ్చు. కాకుంటే కొంచెం ఓపికతో, వాస్తవిక దృష్టితో మనం చూడగలగాలి. శాస్త్ర సాంకేతిక రంగం ప్రపంచాన్ని శాసిస్తున్న యుగంలో ఉన్నత విద్య ఏ దేశాన్నయినా ఆ పోటీలో దీటుగా ఎంత నిలబడగలిగేలా చెయ్యగలదో మాత్రమే గాదు,
సంపాదకీయం

చరిత్రపాఠాలు చేదుగా వుంటాయి!

సంపాదకీయం "ప్రపంచ నాగరికతల ఘర్షణా ప్రవక్త" శామ్యూల్ హటింగ్టన్ సమాధి నుంచి లేచొచ్చి అమాంతం అమెరికా ప్రభుత్వాన్ని ఆవహించినట్టుంది! పాశ్చాత్యదేశాల నాగరికతకు ఎప్పుడూ లేని ముప్పు ముంచుకొచ్చిందనీ, వలసల్ని అడ్డుకోకుంటే వాటి ప్రాభవం, భవిష్యత్తూ మంటగలిసి పోతాయనీ అది గగ్గోలు పెట్టడం మొదలెట్టింది. దీనికోసం ఒక "నూతన వ్యూహాత్మక నివేదికను" రూపొందించి, దాన్ని ప్రపంచ దార్శనికతా పత్రంగా వర్ణిస్తూ ముందుకు తెచ్చింది. ఒకవైపు అమెరికా మానవ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన
సంపాదకీయం

మళ్ళీ తూర్పు దేశాలకు వైజ్ఞానిక వైభవం!

సంపాదకీయం విజ్ఞాన శాస్త్రపు ప్రయాణాన్ని ,పరిణామాన్ని కూడా చరిత్రగా రాస్తే అదీ మానవ చరిత్రకు నకలుగా కనిపిస్తుంది. కాలం కలిసి రానప్పుడు అప్పటి దాకా జాజ్వల్యమానంగా వెలిగిన చోటి నుండి ఎక్కడ  ఠికాణా దొరికితే అక్కడికి సైన్సూ వలస పోయింది .అలా ప్రపంచంలో ఒక్కో యుగంలో ఒక్కో చోట అది కొలువు తీరింది .వెళ్లిన చోటల్లా వెలుగులు చిమ్ముతూ ఆ సమాజాల్ని విప్లవీకరించింది. మళ్లీ కష్టకాలం వస్తే మూటా ముల్లే సర్దుకుని
సంపాదకీయం

జ్ఞానం-మౌనం

సంపాదకీయం జ్ఞానం మౌన సంస్కృతిని బద్దలు చేయాలి. మన బుర్రల్ని తొలిచేస్తున్న అసంగత ఆలోచనావైపరీత్యాల నుంచి మనల్ని బయటపడేసి నిరంతర క్రియాశీలురుగా మార్చాలి. ఆ క్రమంలో జ్ఞానం కూడా తనకు తాను పునరుజ్జీవితమై కొత్త చివుళ్ళు తొడగాలి, వుంటే అలాంటి జ్ఞానం వుండాలి, ఇస్తే అలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలి. మరి అలాంటి జ్ఞానాన్ని ఎందుకు అందివ్వలేకపోతున్నాం? అటువంటి జ్ఞానాన్ని మాత్రమే జ్ఞానంగా ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? ఈ నిర్ధారణల్ని, ప్రశ్నల్ని చరిత్రలో
సంపాదకీయం

విజ్ఞానశాస్త్ర భారతీయీకరణ

సంపాదకీయం కొన్ని మాటలు పైకి చాలా గంభీరంగా కనిపిస్తాయి. మనకు తెలియని ఊహాలోకపుటంచుల్లోకి మోసకెళుతున్నట్టుంటాయి. ఇలాంటి మాటల్ని సృష్టించడంలో మన ప్రభుత్వ పండితులు ఘనా పాఠీలు! నివేదికలు తయారు చేయడానికీ,మేనిఫెస్టోలు రాయడానికీ వీరికో భాష వుంటుంది. దాంతో పాటు కొనుక్కొచ్చుకున్న హృదయం కూడా ఒకటి వుంటుంది. ఈ భాషతో తాము ఆచరించని, విశ్వసించని వాటిని మన మీద కుమ్మరిస్తుంటారు అందులో మనల్ని కొట్టుకు పొమ్మంటారు. అలాంటి భాష నుంచి పుట్టిన
సంపాదకీయం

పురాణగాధా శోధనలో తరిస్తున్న పురాతత్వ శాఖ

సంపాదకీయం రంగస్థలం పైకి మహాభారత సీరియల్ యోధుడి గెటప్ తో నటుడు మనోజ్ బాజ్ పాయి స్వగతంలో భారత యుద్ధవీరుల్ని మననం చేసుకుంటూ ప్రత్యక్షమవుతాడు. కృష్ణుడి, కర్ణుడి రథాల్ని కీర్తిస్తూ నేపథ్యగానం వీనులవిందు చేస్తుంది. ఇంతలో గ్రాఫిక్స్ మాయాజాలం మధ్య రెండు చక్రాల గుర్రాల రథం సాక్షాత్కరిస్తుంది. అది కొయ్యదే గానీ చక్రాలతో సహా మొత్తం రాగి రేకుల తాపడంతో ధగధగలాడుతుంటుంది. ఓ నిమిషం తర్వాత రంగురంగుల ఫ్లడ్ లైట్ల
సంపాదకీయం

పరిశోధనా రంగానికి ప్రమాద ఘంటికలు!

సంపాదకీయం ఈ మాట నమ్మశక్యం గానిది.  కారణం పరిశోధన లేని వైజ్ఞానిక పురోగతి లేదు. వైజ్ఞానిక అభివృద్ధిలేని  సమాజ పురోగమనమూ లేదు. ఈ రంగంలో పోటీపడి ముందు నిలబడలేని దేశాలు ఎంత సంపదా, ఎంత సంస్కృతీ, ఎంత చరిత్రా వున్నా ముందుకు పోలేవు. శాస్త్ర సాంకేతికాభివృద్ధి పైనే ఆధునిక ప్రపంచం నడుస్తోంది. అమెరికా  ప్రపంచాధిపత్యం కూడా దీని వల్లనే సాగుతోంది. కానీ ఆశ్చర్యంగా అమెరికా తన పరిశోధనా కార్యక్రమాలకు కత్తెర
సంపాదకీయం

చిక్కుల్లో చిన్న స్కూళ్ళు !

సంపాదకీయం గత పదేళ్లలో ఏకంగా దేశంలో 89,441 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. ఈ మూతల్లో మధ్యప్రదేశ్ (29 410), ఉత్తర ప్రదేశ్ (25,126) రాష్ట్రాలు 60.9% వాటాతో ముందున్నాయి. దీన్నీ మధ్య సాక్షాత్తు కేంద్ర విద్యా శాఖ ఉప మంత్రి జయంత్ చౌదరి గారు పార్లమెంటులో ప్రకటించారు. మన తెలుగు రాష్ట్రాలు ఈ “రికార్డును” 2015 కు ముందే సాధించాయి! వీటిలో 9503 పాఠశాలలు అప్పటికే తలుపులు మూసేశాయి. ఇవన్నీ