తెలుసుకొందాం

తెలుసుకొందాం!

పద్దెనిమిది ప్రకృతి సూత్రాలు - ఎ. రామచంద్రయ్య ఇంగ్లీషు భాషంతా 26 అక్షరాల సమాహారమే అన్నట్లుగా సైన్స్ లో ఎన్ని వేల సూత్రాలు వున్నా అవన్నీ మౌలికంగా 18 ప్రాథమిక సూత్రాల సమాహారమని ఆధునిక శాస్త్రజ్ఞులు రుజువు చేశారు. ఈ మిలీనియం ఆరంభంలో ఒక అంతర్జాతీయ స్థాయిలో జరిగిన శాస్త్రజ్ఞుల మహాసభలో ఈ సూత్రాలను తీర్మానించారు.  ఈ సూత్రాలు ఇక అంతిమమనీ వీటికి డోకా లేదని సైన్సు శాసించదు. కానీ
నమ్మకం-నిజం

నమ్మకం- నిజం

గబ్బిలం అరిష్టమా? - యుగంధర్ బాబు అదేదో సీరియల్ లో పాము మనిషిగా మారిపోతుంది. మనిషి పాముగా అయిపోతాడు. నాగమ్మ .. శ్వేతనాగు... ఇలా రకరకాల పేర్లతో రకరకాల సినిమాలూ, సీరియళ్ళూ! అసలు మనిషిగా పుట్టిన వాళ్లు కనీసం మనిషిగా మారడానికే ప్రయత్నం చేయడం లేదు కానీ జంతువుల్ని మాత్రం మనుషులుగా మార్చేస్తున్నారు! ఇలా జంతువులు మనుషులుగా మారే కథల్లో ముందంజలో వుంటుంది ఒక జీవి. అదే అమాయక ప్రాణి
పిల్లలు-చదువులు

పిల్లలు-చదువులు

బడి బయట పాఠాలు  -2 భయం భయంగా.. - సి. వి. కృష్ణయ్య ఆ పిల్లవాడికి ఎనిమిదేళ్లు ఉంటాయి. రెక్కలు దొడిగే వయసు. వాడి ముందు మూడు ప్రపంచాలు నిలిచి ఉన్నాయి. అందులో బడి ఒకటి. అంటే టీచర్లు, అక్షరాలు, అంకెలు, శిక్షలు. రెండోది వింత అనుభూతులు పంచే అద్భుత ప్రపంచం - కొండలు, గుట్టలు, తోటలు, దొడ్లు, పిట్టలు పురుగులు. మూడోది నిజమో అబద్ధమో అర్థం గాని మాయా
శాస్త్ర వికాసం

శాస్త్ర వికాసం

నాగరికతల సంగమంలో భారతీయ గణిత విజ్ఞానం - అనుసృజన: వి. రాహుల్జీ ఇంత దూరం మానవ నాగరికత వర్ధిల్లుతోందంటే అదంతా ఇచ్చిపుచ్చుకోవడాల వల్లే సాధ్యమైంది. ఒక్కో చారిత్రక సంధ్యలో ఒక్కో నాగరికత ఒక్కో ఆవిష్కరణకు బాట వేసి వుండొచ్చు, ఒక ప్రకృతి నియమాన్ని పట్టుకొని వుండొచ్చు. దీనికి కచ్చితంగా ఆ నాగరికతను ప్రశంసించాల్సిందే. చరిత్రలో దానికా స్థానం దక్కాల్సిందే. అయితే ఏ నాగరికతా తనకు తాను సంపూర్ణం కాదు. ఒంటరిదీ కాదు.
శాస్త్ర ప్రచారం

శాస్త్ర ప్రచారం

సృజనను పెంచే సైన్సు ఫిక్షన్  -   ఎస్. వెంకట్రావు మనిషిని జంతువు నుండి వేరు చేసే ప్రధాన లక్షణం ఊహాశక్తి. జంతువు ఆలోచనల్లో  "నిన్న" లేదు కాబట్టి" రేపు" కూడా వుండదు. దానికి వున్నది "అప్పుడు" " అక్కడ" మాత్రమే. కానీ మనిషి ఊహాశక్తి అతన్ని "నేటి" నుండి విడగొట్టింది. అందుకే అతడు నిన్నటి గురించి ఆలోచించగలడు. రేపటి గురించి ఊహించగలడు. ఇదే అతడిని ఆధునిక మానవునిగా మెట్టు మెట్టు ఎదగడానికి
సందర్భం

స్వతంత్ర భారతపు  తొలి వేకువలో..

స్వతంత్ర భారతపు  తొలి వేకువలో "స్వావలంబన కోసం సైన్సు" ప్రయత్నాలు ! ఆధునిక భారతదేశం సాధించిన శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక విజయాలకు కారణం స్వాతంత్రం వచ్చిన కొత్తలో  ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగంలోని పరిశోధనశాలలు, పరిశ్రమలు. వీటిని స్థాపించడం లో ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రు పాత్ర మాత్రమే చూస్తే సరిపోదు. మేఘ నాధ్ సాహా, సాహిబ్ సింగ్ సోఖి, సయ్యద్ హుస్సేన్ జహీర్ వంటి శాస్త్రవేత్త లే కాక J.B.S
సంపాదకీయం

విజ్ఞాన మొక్కటె నిలిచి వెలుగును

సంపాదకీయం విజ్ఞాన మొక్కటె నిలిచి వెలుగును సమాజపు అవసరాలే విజ్ఞాన శాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించాయా లేక వైజ్ఞానిక ఆవిష్కరణలే సమాజానికి కొత్త అవసరాల్ని సృష్టించాయా?  ఏ చారిత్రక సంధ్యలో  ఏ ఆవిష్కరణలు ఏ అవసరాల కోసం వెలుగు చూసాయి? ఏ  వైజ్ఞానిక కాంతిరేఖల ఫలితంగా చరిత్ర ఏ మలుపులు తిరిగింది? ఎలాంటి అవసరాలు, ఎవరి అవసరాలు అంతి మంగా ఈ కథ నడిపిస్తున్నాయి? ఈ ప్రక్రియలో సామాన్యుడి పాత్ర
సమాచారం

జాతీయ శాస్త్రీయ దృక్పథ దినం!

ఆగస్టు 20 జాతీయ శాస్త్రీయ దృక్పథ దినం! ఆగస్టు 20, డాక్టర్ నరేంద్ర దబోల్కర్ ను మతఛాందసశక్తులు  కిరాతకంగా బలిగొన్నదినం. సైన్సు కోసం, శాస్త్రీయ ఆలోచనల కోసం ఒక యోధుడు బలిదానం చేయాల్సి రావటం స్వతంత్ర భారత చరిత్రలో సిగ్గుతో తలవంచుకోవలసిన దినం. మరోవైపు ఆధునిక దృక్పథం కోసం తపించే శక్తులందరికీ ఇది ఒక దీక్షాదినం కూడా. దబోల్కర్ ఉసురు తీసిన శక్తులే ఆ తరువాత డాక్టర్ గోవింద పన్సారేని,
చరిత్ర ఏమంటుంది

సైన్స్ చరిత్రలో కొన్ని పుటలు..

సైన్స్ చరిత్రలో కొన్ని పుటలు.. - డాక్టర్ గేయానంద్ 18వ శతాబ్దం, విప్లవాల కాలం. మేధావులు మామూలు మనుషులు కలిసిమెలిసి మాట్లాడుకున్న కాలం. సంఘాలుగా ఏర్పడిన కాలం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం చుట్టూ మొట్టమొదటిసారిగా సంఘాలు ఏర్పడిన కాలం ఆదే. అట్లా ఏర్పడిందే లూనార్ సొసైటీ. ఇంగ్లాండ్ లో1765-1813 మధ్యకాలంలో ఈ సొసైటీ చురుగ్గా ఉండేది. అందులో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఆలోచన పరులూ ఉండేవారు. నెలకు ఒకసారి, పున్నమికి దగ్గరలో
శాస్త్ర వికాసం

ఉద్దాలక అరుణి

ఉద్దాలక అరుణి ఉవాచ! - విటపు బాల సుబ్రహ్మణ్యం "పుత్రా! శ్వేతకేతూ! వచ్చావా నాయనా? పన్నెండేళ్ళ గురుకుల వాసంలో ఎంత పెద్దవాడివైపోయావురా? విద్యాభ్యాసం సంతృప్తిగా పూర్తి చేసావా? ఇరవై నాలుగేళ్లు వచ్చాయి కదా! గురువులు గృహస్థాశ్రమానికి అనుమతించారా?" "తండ్రీ! నాలుగు వేదాలు ఆపోశనం పట్టాను. షడ్దర్శనాలు నా నాలుక మీదే వున్నాయి. 'ఉద్దాలకపుత్రుడు శ్వేతకేతువిప్పుడు సకల శాస్త్ర పారంగతుడు! తండ్రిని మించిన కొడుకు! గురువును మించిన శిష్యుడు!' అని మా గురువులే మెచ్చుకున్నారు!"