ప్రకృతి-పర్యావరణం

నివాళి : ప్రజా పర్యావరణ తాత్వికుడు మాధవ్ గాడ్గిల్

విఠపు బాలసుబ్రహ్మణ్యం పర్యావరణం అంటే నదులూ, కొండలేనా? అడవులూ, చెట్లేనా? పక్షులూ, జంతువులేనా? మరి వాటి మధ్య బతుకుతున్న మనుషుల సంగతేమిటి? వారి మనుగడ మాటేమిటి ? ఈ ప్రశ్నలు మన నాగరిక పర్యావరణ మిత్రులకు చాలామందికి ఎదురు గావు. కొండ కోనల్ని నమ్ముకొని తరాల తరబడి వాటి చుట్టూ తమ జీవితాల్ని అల్లుకున్న మూల ప్రజల గురించి వారు పట్టించుకోరు. చాలా సందర్భాల్లో ప్రజలకు, జీవావరణానికి మధ్య వాళ్లు