మిఠాయి యుగంధర్ బాబు ప్రపంచంలో ప్రతి సంస్కృతి, నాగరికత మనిషికి సంక్రమించే వ్యాధులకు ఏదో రకమైన ముఢనమ్మకాలను ఆపాదిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఈ వ్యాధుల గురించి శాస్త్రీయ అవగాహన లేనప్పుడు, వ్యాధులు దేవతల యొక్క కోప, ప్రకోపాలని భావించే వాళ్ళు. ఆ దేవతలను ప్రసన్నం చేసుకుంటే వ్యాధి తగ్గుతుందని భావించి అందుకోసం బలులిచ్చి, పూజలు, జాతరలు చేసేవాళ్లు (ఇప్పటికీ జాతరలు అన్నిచోట్లా చాలా జరుగుతూనే ఉన్నాయి). తరం నుండి మరోతరానికి