ఎం. కె. వైను బప్పు (1927-1982)
అరవింద్ గుప్తా ఆధునిక భారతీయ ఖగోళశాస్త్ర పితామహుడు అనదగిన వాడు వైను బప్పు. ఆయన అవిశ్రామ కృషి వల్ల, భారతదేశంలో భవిష్య ఖగోళశాస్త్ర పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి. వైను బప్పు 1927 ఆగస్టు 10న జన్మించారు. వారి కుటుంబం కన్ననూర్ నుంచి వచ్చినా, తండ్రి హైదరాబాద్లోని నిజామియా పరిశీలనాలయంలో పని చేసేవారు. అందువల్ల ఆయన పాఠశాల, కళాశాల విద్య హైదరాబాద్లో జరిగింది. ఆయన వక్తృత్వపు ప్రజ్ఞ వల్ల
