శాస్త్రజ్ఞులు

వృక్ష శిధిలాలతో చరిత్రను విశ్లేషించిన విజ్ఞాని బీర్బల్ సహా సాహ్ని

డా. నాగసూరి వేణుగోపాల్ వృక్షశిథిలాలతో చరిత్ర గానాలు విశ్లేషించిన మహనీయుడు బీర్బల్ సాహ్ని! మనదేశంలో పాలియో బోటని అనగానే గుర్తుకు వచ్చే శాస్త్రవేత్త ఆయన. శిలావశేషాలలోని వివిధ పొరలలో ఉండే వృక్ష సంబంధమైన పదార్థాలను అధ్యయనం చేయడమే 'పాలియో బోటని (Paleo Botany)'. దీనిని తెలుగులో 'పురావృక్షశాస్త్రం' అని అంటాం.             ఒకవైపు వృక్షశాస్త్రం, మరోవైపు భూభౌతికశాస్త్రం, ఇంకోవైపు చరిత్ర పరిశోధన మేళవించిన
శాస్త్రజ్ఞులు

తెలుగువారు మరిచిపోయిన మహా శాస్త్రవేత్త, ‘కెమటాలజీ పిత’ కొలచల సీతారామయ్య

డా. నాగసూరి వేణుగోపాల్ 'కెమటాలజి' (Chematalogy) అంటే ఏమిటో చెప్పగలరా? పోనీ 'ట్రైబో కెమిస్ట్రీ' (Chemistry) అంటే వివరించగలరా? నిజానికి రెండూ ఒకటే! ఒకటి రష్యాలో పిలుచుకునే పేరయితే, రెండవది పాశ్చాత్య ప్రపంచం వాడే పేరు. కదలిక వున్నపుడు కలిగే ఘర్షణ, దాన్ని తగ్గించడానికి వాడే కందెనల (లూబ్రికెంట్స్) గురించి తెలిపే శాస్త్ర, సాంకేతిక విభాగం 'ట్రైబోలజీ' అందులోని  ఒక భాగమే - పైన పేర్కొన్న అంశం.. దీని కన్న
శాస్త్రజ్ఞులు

ఆధునిక భారతదేశపు తొలి మహిళాభౌతిక శాస్త్రవేత్త – బిభా చౌదురి

డా నాగసూరి వేణుగోపాల్ వైజ్ఞానిక వెలుగు దివ్వెలు-3 అణుకేంద్రకంలో ఉండే 'మెసాన్' (Meson) ద్రవ్యరాశిని తొలిసారి లెక్కించిన శాస్త్రవేత్త బిభా చౌదురి (Bibha Chowdhuri)! అంతేకాదు మనదేశంలో 'హై ఎనర్జీ ఫిజిక్స్' (High Energy Physics) విభాగపు తొలి మహిళా శాస్త్రవేత్త, ఇంకా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ తొలి మహిళా శాస్త్రవేత్త కూడా ఆమే.  మహా శాస్త్రవేత్తల సహచర్యం బిభా చౌదురి (1913-1991) గురించిన వివరాలకు
శాస్త్రజ్ఞులు

దేశవాళీ రసాయన శాస్త్ర పరిశోధన, పరిశ్రమల అభివృద్ధి సాధించిన త్యాగధనుడు – ఆచార్య ప్రపుల్ల చంద్ర రే

డా. నాగసూరి వేణుగోపాల్ అది బ్రిటిష్ వారు పాలించే కాలపు భారతదేశ రాజధాని కలకత్తా పట్టణం. ఆ యువకుడు రసాయన శాస్త్ర అధ్యాపకుడు. ఆయన ఇల్లే ఒక చిన్న ప్రయోగశాల. పరిశోధనల కోసం పశువుల ఎముకలు సేకరించి ప్రయోగశాలలో పోగు చేశాడు. ఎముకల వాసన ప్రయోగశాలకే పరిమితం కాక, ఆ వీధి అంతా గుప్పుమంది! అంతేకాదు, కాకులు బారులుగా వాలి, వీధి అంతా పచార్లు కొడుతున్నాయి. దాంతో ఆ ప్రాంతం
శాస్త్రజ్ఞులు

సకల సైన్సు సుగుణాభిరాముడు జె. వి. నార్లీకర్

డాII. నాగసూరి వేణుగోపాల్ నేటి తరాలకు పరిపూర్ణంగా ఆదర్శమూర్తిగా నిలిచే మన కాలపు మహా శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లీకర్. జగదీష్ చంద్రబోస్ అనగానే కలకత్తాలోని బోస్ ఇన్స్టిట్యూట్, సి.వి. రామన్ అనగానే బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హోమీ జహంగీర్ భాభా అనగానే ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, మేఘనాథ సాహా అనగానే కలకత్తాలోని సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ వంటివి గుర్తుకు వచ్చినట్లుగానే జె.వి.
శాస్త్రజ్ఞులు

ఎం. కె. వైను బప్పు (1927-1982)

అరవింద్ గుప్తా ఆధునిక భారతీయ ఖగోళశాస్త్ర పితామహుడు అనదగిన వాడు వైను బప్పు. ఆయన అవిశ్రామ కృషి వల్ల, భారతదేశంలో భవిష్య ఖగోళశాస్త్ర పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి. వైను బప్పు 1927 ఆగస్టు 10న జన్మించారు. వారి కుటుంబం కన్ననూర్ నుంచి వచ్చినా, తండ్రి హైదరాబాద్లోని నిజామియా పరిశీలనాలయంలో పని చేసేవారు. అందువల్ల ఆయన పాఠశాల, కళాశాల విద్య హైదరాబాద్లో జరిగింది. ఆయన వక్తృత్వపు ప్రజ్ఞ వల్ల
ప్రజారోగ్యం శాస్త్రజ్ఞులు

ప్రసూతి చికిత్స పితామహుడు వి.ఎన్. శిరోద్కర్ (1899-1971)

అరవింద్ గుప్తా డా॥ వి.ఎన్.శిరోద్కర్ పేరు ప్రపంచమంతా “శిరోద్కర్ కుట్టు” కనుగొన్న వ్యక్తిగా ఖ్యాతి గాంచింది. సర్జన్ ఆయన మహిళల వ్యాధుల చికిత్సకు ఎంతో దోహదం చేశారు. విఠల్ నగేశ్ శిరోద్కర్ 1899లో గోవాలోని శిరోదా గ్రామంలో జన్మించారు. గ్రామం పేరు మీదనే వారికి ఆ ఇంటి పేరు సంక్రమించింది. హుబ్లీలో విద్యను అభ్యసించి ముంబయిలోని గ్రాంట్ వైద్య కళాశాలలో చేరారు. 1923లో ఎం.బి.బి.ఎస్. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గర్భధారణ, ప్రసూతి
శాస్త్రజ్ఞులు సందర్భం

కమల సొహొని (1912-1998)

అరవింద గుప్త విజ్ఞాన శాస్త్ర రంగంలో పిహెచ్.డి చేసిన మొదటి మహిళ కమల సొహొని. పేద పల్లెప్రజలు తినే ఆహారంలోని మూడు ముఖ్య అంశాల మీద విస్తృతంగా జీవరసాయనిక పరిశోధనలు చేసి వాటి పోషక విలువలను ఆమె కనుగొన్నారు. కమల 1912లో జన్మించారు. తండ్రి నారాయణరావ్ భగత్, మామయ్య మాధవరావ్ పేరుగాంచిన రసాయనిక శాస్త్రవేత్తలు. బెంగుళూరులోని భారత విజ్ఞానశాస్త్ర సంస్థ నుంచి మొదట పట్టభద్రులైన వాళ్లల్లో వీరు కూడా ఉన్నారు.