ప్రజారోగ్యం శాస్త్రజ్ఞులు

ప్రసూతి చికిత్స పితామహుడు వి.ఎన్. శిరోద్కర్ (1899-1971)

అరవింద్ గుప్తా డా॥ వి.ఎన్.శిరోద్కర్ పేరు ప్రపంచమంతా “శిరోద్కర్ కుట్టు” కనుగొన్న వ్యక్తిగా ఖ్యాతి గాంచింది. సర్జన్ ఆయన మహిళల వ్యాధుల చికిత్సకు ఎంతో దోహదం చేశారు. విఠల్ నగేశ్ శిరోద్కర్ 1899లో గోవాలోని శిరోదా గ్రామంలో జన్మించారు. గ్రామం పేరు మీదనే వారికి ఆ ఇంటి పేరు సంక్రమించింది. హుబ్లీలో విద్యను అభ్యసించి ముంబయిలోని గ్రాంట్ వైద్య కళాశాలలో చేరారు. 1923లో ఎం.బి.బి.ఎస్. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గర్భధారణ, ప్రసూతి
ప్రకృతి-పర్యావరణం

గంగా నది కాలుష్యం, స్వయంశుద్ధి రహస్యం

 టి. వి. వెంకటేశ్వరన్ 1892లో ఎర్నెస్ట్ హాన్బరి హన్కిన్స్ అనే సైంటిస్టుని కెమికల్ అనలిస్టుగా, బాక్టీరియాలజిస్టుగా పంజాబ్ ప్రావిన్సు, మధ్య ప్రావిన్సులలో పనిచేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది. అతని ప్రధాన కర్తవ్యం బ్రిటీష్ సైనికుల్ని ప్రాణాంతక వ్యాధులనించి ప్రత్యేకించి కలరా నుంచి కాపాడ్డం. ఢిల్లీలో అతను ప్రతిరోజూ వేలమంది స్థానికులు యమునా నదిలో స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువులు కడగడం చూసి ఆశ్చర్య పోయాడు. ఇతర యూరోపియన్ ఆఫీసర్ల
తెలుసుకొందాం

తొమ్మిదవ సార్వత్రిక నియమము

ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య విశ్వంలో అన్ని సంఘటనలలోనూ ద్రవ్య-శక్తి నిత్యత్వమే ఉంటుంది! పదార్ధం-శక్తి రూపాల్లో మారవచ్చునేగాని పదార్ధం-శక్తి పరిణామం సంఘటనకు ముందు సంఘటన తర్వాత ఒకే విధంగా ఉంటాయి. సంఘటనలలో పదార్ధం-శక్తిని నూతనంగా సృష్టించలేము. నాశనం చేయలేము.(Matter - Energy are Conserved During Any Process. Energy and Matter May Change Their forms but the Net Quantity of Matter- Energy is fixed
నమ్మకం-నిజం

ఆధునిక యుగంలో అమానుష విశ్వాసం

యుగంధర్ అది ఊరి బయట ఒక ఇంటిలో ఓ గది. గది గోడల నిండా రకరకాల దేవతల భయంకర రూపంలో ఫోటోలు. గది అంతా దీపపు కాంతితో వెలిగిపోతోంది. అక్కడక్కడ సాంబ్రాణి పొగ లుంగ చుట్టుకుని మెల్లగా వెలువడుతోంది. గది మధ్యలో పెద్ద ముగ్గు. ఆ ముగ్గులో అక్కడక్కడ పూలు, పసుపు కుంకుమలు, పెద్ద పెద్ద నిమ్మకాయలతో అలంకరించబడి ఉంది. ముగ్గు మధ్యలో పిండితో చేయబడి, వికృతంగా కాళ్లు, చేతులు
మంచిమాట

మంచి మాట

నిజంనిజం కూడా నిరంతరం ప్రచారంలో వుండాలి లేకుంటే నిజం అబద్ధంగా మారుతుంది.రాష్ట్రాన్ని, దేశాన్నే గాదు ప్రపంచాన్ని సైతం ప్రమాదంలోకి నెడుతుంది!-బి. ఆర్. అంబేద్కర్
సంపాదకీయం

“అయో”మయ రాజకీయాలు !

సంపాదకీయం వృత్తాసుర సంహారం కోసం దేవతల కంసాలి త్వష్ట ఇంద్రుడికి వజ్రాయుధం తయారు చేసి ఇచ్చాడట. దీంతో ఆ ఆర్య యోధుడికి ఎదురులేకుండా పోయిందట. ఒంటి చేత్తో శత్రు స్థావరాలను కకావికలం చేసాడట. ఫలితంగా ఇంద్రాధిపత్యం శాశ్వతంగా దఖలు పడిపోయిందట! ఇది పురాణం. ఆశ్చర్యం ఏమంటే ఆధునిక యుగంలోనూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతికి ఒక వజ్రాయుధం చిక్కింది. కాకుంటే ఇప్పుడాయనకు పురాతత్వ శాస్త్ర వేత్తలు నేల పొరల్నండి తవ్వితీసి
శాస్త్ర ప్రచారం

ఉపద్రవంగా మారుతోన్న విజ్ఞానోన్మాదం!

 డా.విరించి విరివింటి సైన్సు అంటే మన చుట్టుపక్కల పరచుకొని వున్న చరాచర జగత్తుకి ఒక వివరణాత్మక నమూనా మాత్రమే. కానీ ప్రపంచం సైన్సుని అంతవరకే చూసిందనలేము. మనం 19 -20 శతాబ్దాల చరిత్రను చూస్తే మానవులు సైన్సుని చాలాసార్లు ఒక భావజాల ఆయుధంగా వాడుకున్నారన్న వాస్తవం బయటపడుతుంది. మనుషుల్లోని వైషమ్యం, అసమానత, యుద్ధపిపాస, సంకుచిత జాత్యాధిపత్యం వీటన్నిటికీ శాస్త్రపరమైన సమర్ధనల్ని సైన్సు అందించింది. అది మానవ కపాలాలను కొలిచే ‘క్రేనియోమెట్రీ’
శాస్త్రజ్ఞులు సందర్భం

కమల సొహొని (1912-1998)

అరవింద గుప్త విజ్ఞాన శాస్త్ర రంగంలో పిహెచ్.డి చేసిన మొదటి మహిళ కమల సొహొని. పేద పల్లెప్రజలు తినే ఆహారంలోని మూడు ముఖ్య అంశాల మీద విస్తృతంగా జీవరసాయనిక పరిశోధనలు చేసి వాటి పోషక విలువలను ఆమె కనుగొన్నారు. కమల 1912లో జన్మించారు. తండ్రి నారాయణరావ్ భగత్, మామయ్య మాధవరావ్ పేరుగాంచిన రసాయనిక శాస్త్రవేత్తలు. బెంగుళూరులోని భారత విజ్ఞానశాస్త్ర సంస్థ నుంచి మొదట పట్టభద్రులైన వాళ్లల్లో వీరు కూడా ఉన్నారు.
చరిత్ర ఏమంటుంది

ఆదిమ సామాజిక జీవితాలు

డా.యం.గేయనంద్ ప్రాథమిక జ్ఞాన విజ్ఞానాలు..ని, ఎవరో మంత్రం వేసినట్టు సృష్టించలేదు. జీవ పరిణామంలో మానవజాతి ఆవిర్భావం యాదృచ్ఛికం. భూఖండాలు కలవడం విడిపోవడం, వివిధ శీతోష్ణ పరిస్థితులు లక్షలాది సంవత్సరాలు కొనసాగడం, మంచు యుగాలు ఏర్పడటం, మధ్యలో వెచ్చటి వాతావరణాలు, అడవులు పెరగడం క్షీణించడం, మైదానాలు ఏర్పడటం, అగ్నిపర్వత విస్పోటనం – ఇలాంటి పరిణామాల మధ్య, తిని తిరిగి నిలదొక్కుకోగలిగిన జీవులు మానవ స్వరూపం సంతరించుకున్నాయి. గత 60-70 లక్షల సంవత్సరాలలో,
ప్రకృతి-పర్యావరణం

వ్యవసాయం పై వాతావరణ మార్పుల ప్రభావం

ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాల రావు ప్రస్తుతం “వాతావరణ మార్పు” ప్రపంచాన్ని వణికిస్తున్న అంశమని అర్థమౌతూనే ఉంది. కారణం, ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే అన్ని రంగాల్లోకి అతిముఖ్యమైంది వ్యవసాయం-ఆహారొత్పత్తి. ప్రతి చిన్న వాతావరణ ఎగుడు, దిగుడులు, పర్యావరణ పరిణామాలు, అత్యంత సున్నితమైన జీవావరణం పై పడతాయి. ఫలితంగా మన ఆహారానికి కీలకమైన పంటల సాగు, జీవాల పెంపకం, సమస్యల వలయంలోకి నెట్టబడతాయని యిప్పటికే అనుభవాలు చెప్తున్నాయి. ఈ వాతావరణ మార్పుకు “హరిత