ముసురుకొస్తోన్న మేధోమాంద్యం
సంపాదకీయం క్రమంగా మానవ సమాజం మూగబోతోందా? భిన్న దృక్పథాల ప్రవాహాలకూ, నూతన ఆలోచనా స్రవంతులకూ తావులేని ఎడారిగా మారుతోందా? మనిషి ప్రశ్నించడం మరిచిపోతున్నాడా? ఎదిరించడం, నిలదీయడం, ప్రజల పక్షాన నిలబడడం మేధావులు తమ పని కాదనుకుంటున్నారా? మౌనధారణే మేలనుకుంటున్నారా? ఒకవైపు మానవుడు భూనభోనాంతరాలను జయించానని జబ్బలు చరుస్తున్నాడు. ప్రకృతి శక్తుల్ని గుప్పిట్లో బంధించానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అవును మనిషి చరిత్ర ఎప్పుడూ ఎరగని ఆవిష్కరణలు చేస్తున్నమాట నిజమే. ఎల్లల్ని చెరిపేసి
