సంపాదకీయం

సంపాదకీయం

కృత్రిమమేధ చెపుతున్న కొత్త పాఠం చిన్నప్పుడు మన పాఠశాలల్లో మనల్ని వారానికో, మాసానికో ఒకసారి ఏదో ఒక అంశంపై స్వంతంగా వ్యాసం రాయమనేవాళ్ళు. కిందామీదా పడి ఎక్కడెక్కడ నుంచో సమాచారం సేకరించుకొని రాసేవాళ్ళం. అందులో ఏవేవో ఆలోచనల్ని చొప్పించే వాళ్ళం. అందంగా రాయడానికి కుస్తీ పట్టేవాళ్ళం. మనకంటూ ఏదో ఒక ప్రత్యేకత వుండాలని తాపత్రయం పడేవాళ్ళం. ఇందులో కాపీలు ఉండేవి కావు. ఒకరి మీద ఆధారపడ్డం అసలే వుండేది కాదు.
శాస్త్ర వికాసం

సైన్స్ సిద్ధాంతాలు & సామాజిక వాతావరణం

డా. విరించి విరివింటి జీవశాస్త్ర పరిధిలోనే కాలానుగుణంగా క్రమానుగతంగా వచ్చిన ఒక అంతర్గత హేతుబద్ధ పరిణామమే చివరికి డార్విన్ సిద్ధాంతంగా ఏ విధంగా పరిపక్వతకు వచ్చిందో గత వ్యాసంలో చూశాం. ఈ వ్యాసంలో ఇంకాస్త ముందుకు పోయి అసలు ఇటువంటి జీవశాస్త్రం వంటి విజ్ఞాన సంబంధ విషయాలను ఆయా కాలాల సామాజిక ఆర్థిక పరిస్థితులు లేదా భావనలు ఏమైనా ప్రభావితం చేస్తాయా? అనే విషయాన్ని గమనిద్దాం‌.  ఎందుకంటే మనకందరకూ తెలిసిన
శాస్త్ర వికాసం

బిగ్ బ్యాంగ్ మహా విస్ఫోటనం: శూన్యం నుండి అనంత విశ్వం వరకు!

రవిరాజ పోతినేని సుమారు 13.8 బిలియన్ ఏళ్ల క్రితం.. అప్పుడు కాలం లేదు, స్థలం (Space) లేదు, అసలు శూన్యం తప్ప ఏమీ లేదు! కానీ, ఒకే ఒక్క క్షణం.. ఒక అంతుచిక్కని మహా విస్ఫోటనం! ఒక చిన్న అణువు కంటే తక్కువ పరిమాణం ఉన్న బిందువు నుండి నేటి అనంత విశ్వం ఎలా పుట్టింది? శూన్యం నుండి నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు ఎలా ఆవిర్భవించాయి? మన విశ్వం వెనుక
శాస్త్ర ప్రచారం

‘మిస్సింగ్ లింకు’ దొరికింది!

ఎస్. వెంకట్రావు ఈ భూమ్మీద జీవులను భగవంతుడనే అగోచర శక్తి ఏదీ సృష్టించలేదనీ, పదార్ధ పరిణామ క్రమంలో భాగంగా సూక్ష్మజీవులూ వాటినుండి ఉన్నతమైన జీవులూ ఆవిర్భవించాయని 'పరిణామ వాదం' ఎన్ని సాక్ష్యాలు చూపించి చెబుతున్నప్పటికీ ఇంకా దాన్ని నమ్మని వారూ, 'సృష్టి వాదాన్నే' పట్టుకు వేలాడే వారూ చాలా మంది ఉన్నారు.. శాస్త్ర ప్రపంచంలో ప్రతిదాన్నీ సవాలు చేస్తున్నట్లే చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన పరిణామ వాదాన్ని కూడా సవాలు చేయడం
శాస్త్రజ్ఞులు

శాస్త్రవేత్తే కాదు; పరిశోధకుడు, పరిపాలకుడు, పరివ్యాపకుడు … డాక్టర్ బి.ఆర్. రావు

డా. నాగసూరి వేణుగోపాల్ డాక్టర్ బి.ఆర్. రావు గా ప్రఖ్యాతులైన వారి పూర్తిపేరు బెర్రి రామచంద్రరావు. ఆయన పేరెన్నిక గన్న భౌతిక శాస్త్రవేత్త, బోధన, పరిశోధనలలో రాణించడం విశేషం కాకపోవచ్చు. ఆయన విద్యారంగం, పరిపాలనారంగాల్లో కూడా సేవలందించారు; రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. సత్యనారాయణ, సుభద్రమ్మ దంపతులకు రెండో సంతానంగా డా. రావు 1922 నవంబరు 21న విశాఖపట్నం జిల్లా యలమంచిలి గ్రామంలో జన్మించారు. విశాఖపట్నం మిసెస్ ఏవియన్ హైస్కూలులోనూ, తర్వాత
నమ్మకం-నిజం

కరుంగళి మాల

మిఠాయి యుగంధర్ బాబు "కొత్త ఒక వింత పాత ఒక రోత" అనే సామెత విదితమే కదా. కొత్త కొత్త వస్తువులు వస్తుంటే పాత వాటిని (మార్చి) మర్చిపోతూ ఉంటాం. ఈ కొత్త సరుకుల ప్రచారం కోసం మార్కెట్లో మనకు కావలసినన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్, పత్రికల్లో ప్రకటనలు.. ఇక మన "ఇడియట్ బాక్స్" టీవీ ఉండనే ఉంది. అందులో సందు దొరికితే సందులో
చరిత్ర ఏమంటుంది

భారతదేశంలో తొలి మధ్యయుగాలు-  ఆర్యభట్టు ప్రభావం

డా. యం. గేయానంద్ తొలి మధ్యయుగాలలో భారతదేశం అనేక చిన్న మధ్యతరహా రాజ్యాలుగా విడిపోయింది. ఒక కేంద్రీకృత అధికారం క్షీణించింది. స్థానిక పాలకులు నిరంతర యుద్ధాలకు పాల్పడేవారు. వివిధ పద్ధతులలో ఫ్యుడలీకరణ జరిగింది. నగదుకు బదులు భూములను దానంగా/ ప్రతిఫలంగా ఇచ్చే పద్ధతి ఎక్కవయింది. విదేశీ వాణిజ్యం తగ్గడం వల్ల నగరాల ప్రాముఖ్యత తగ్గి గ్రామీణ ఆర్ధిక వ్వవస్థ బలపడింది. అనేక కొత్త ఉప కులాలు ఏర్పడ్డాయి. సామాన్య ప్రజల్లోకి
సైన్స్ పాఠం

ఆమ్లాలు మరియు క్షారాలు

కె. శ్రీకృష్ణసాయి ఒక రోజు తరగతిలో  స్వామి, తన టీచర్ ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. “సార్, ఈరోజు పేపరులో ఒక వార్త చదివాను. ఒక దుండగుడు ఒక అమ్మాయి మీద ఆమ్లం (ACID)పోశాడట. దాంతో ఆమె ముఖం, చర్మం తీవ్రంగా కాలిపోయాయి. కానీ నిమ్మరసం కూడా సిట్రిక్ ఆమ్లం కదా! అది మన శరీరం మీద పడినా ఎలాంటి హాని కలగదు. పైగా మనం దాన్ని తాగుతాము