డా.యం.గేయనంద్ ప్రాథమిక జ్ఞాన విజ్ఞానాలు..ని, ఎవరో మంత్రం వేసినట్టు సృష్టించలేదు. జీవ పరిణామంలో మానవజాతి ఆవిర్భావం యాదృచ్ఛికం. భూఖండాలు కలవడం విడిపోవడం, వివిధ శీతోష్ణ పరిస్థితులు లక్షలాది సంవత్సరాలు కొనసాగడం, మంచు యుగాలు ఏర్పడటం, మధ్యలో వెచ్చటి వాతావరణాలు, అడవులు పెరగడం క్షీణించడం, మైదానాలు ఏర్పడటం, అగ్నిపర్వత విస్పోటనం – ఇలాంటి పరిణామాల మధ్య, తిని తిరిగి నిలదొక్కుకోగలిగిన జీవులు మానవ స్వరూపం సంతరించుకున్నాయి. గత 60-70 లక్షల సంవత్సరాలలో,