కరువు కాలంలో కూరగాయలతో పాలు సృష్టించిన బి.సి.గుహా
వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 11డా. నాగసూరి వేణుగోపాల్ 1943 బెంగాల్ లో భయంకరమైన కరువు సంభవించింది. కరువు అంటే మనకు తెల్సిందే! రకరకాలుగా వనరులు అంతరించడం. ఆ బెంగాల్ కరువులో పాలు అసలు లభ్యం కాకుండా పోయాయి. ప్రొటీన్లున్న ఆహారం దొరక్కుండా పోయింది. పసికందులు పాలు లేకుండా మాడిపోవడం ఎందరినో కలచివేసింది. దీనిని గమనించిన ఒక శాస్త్రవేత్త తన పరిశోధనాంశం వదిలి – దృష్టి మళ్ళించారు. దాని ఫలితమే కాయగూరలతో
